పాలకూర, కొబ్బరన్నం

కావలసిన పదార్థాలు: 
పాలకూర తురుము - 1 కప్పు, 
కొబ్బరి కోరు - 2 టేబుల్‌ స్పూన్లు, 
బాసుమతి బియ్యం - 1 కప్పు, 
నీరు - ఒకటిన్నర కప్పులు, 

ఎండుమిర్చి - 2, 
మిరియాలపొడి, పసుపు, ఆవాలు, శనగపప్పు - పావు టీ స్పూను చొప్పున, 
కరివేపాకు - 4 రెబ్బలు, 
నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం:
 బాసుమతి బియ్యాన్ని చల్లని నీటిలో పావుగంట నానబెట్టాలి. నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, శనగపప్పు, కరివేపాకు వేగించి కొబ్బరి కోరు కలపాలి. 2 నిమిషాల తర్వాత పాలకూర తరుగు వేసి మూతపెట్టాలి. ఆకు మెత్తబడ్డాక మిరియాలపొడి, ఉప్పుతో పాటు బియ్యం కలిపి నీరుపోసి మూతపెట్టాలి. ఈ రైస్‌తో బనానా చిప్స్‌ నంజుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment